గోవిందరావుపేట, జనవరి 8: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ (42) గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం మల్లికార్జున్కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ములుగు దవాఖానకు తరలిస్తుండగా, చనిపోయాడు. మల్లికార్జున్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాదరక్షలు ధరించకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం కృషిచేశాడు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ఆయన పోరాటాన్ని గుర్తుచేస్తూ అభినందించారు. ప్రస్తుతం ములుగు జిల్లా ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ బీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. మల్లికార్జున్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లికార్జున్ మృతి వార్త తెలుసుకొన్న మంత్రి సత్యవతిరాథోడ్ ఫోన్లో సంతాపం ప్రకటించారు. మల్లికార్జున్ కుటుంబానికి అండగా ఉంటామని జడ్పీచైర్మన్ జగదీశ్వర్ భరోసా ఇచ్చారు.