హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో కౌలాలంపూర్లో నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల ఈవెంట్ ఫ్లయర్ ఆవిష్కరణను శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్ క్లబ్లోని సీబీఎన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జీ జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.