హైదరాబాద్, జూన్ 24: దేశంలోనే అతిపెద్ద బంగారు, వజ్రాభరణాల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త షోరూం హైదరాబాద్లో ఏర్పాటైంది. దీంతో నగరంలో ఈ షోరూంల సంఖ్య 10కి చేరింది. కొంపల్లి సుచిత్ర సర్కిల్ దగ్గర ఏర్పాటుచేసిన షోరూంను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గురువారం ప్రారంభించారు. కొంపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అసమానమైన డిజైన్లు, సాటిలేని నాణ్యత, సేవా నైపుణ్యంతో ప్రత్యేక ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందిస్తామని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. నాణ్యతతోపాటు భరోసాతో కూడిన సేవలు అందిస్తామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ అషర్ చెప్పారు.