అందోల్/సంగారెడ్డి : ప్రముఖ ఉర్దూ కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మఖ్దూం మొహియొద్దీన్ స్మారకార్థం రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని పోస్టల్ శాఖ హైదరాబాద్ రీజియన్ డీపీఎస్ ఎస్కే. దేవరాజ్ అన్నారు.
జాతీయ తపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన జన్మస్థలం అందోల్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ జన్మించి తన ఉద్యమాలనే ఊపిరిగా మలిచి ఢిల్లీవరకు తన ప్రస్థానాన్ని కొనసాగించిన మొహియొద్దీన్ స్మారకంగా ఫిలటేలి డే సందర్భంగా తగిన గౌరవం దక్కిందన్నారు.
రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మాట్లాడుతూ.. పోరాటాల పురిటిగడ్డ అందోల్ మట్టిలో పుట్టిన బిడ్డకు మరో అరుదైన గౌరవం దక్కిందన్నారు. ఆయన స్మారకార్ధం భారత పోస్టల్ కవర్ను రూపొదించడంతో ఇక్కడి ఖ్యాతి మరింత పెరిగిందన్నారు.
అందోల్ గ్రామంలో 1908లో జన్మించిన మఖ్ధూం మొహియొద్దీన్ నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా తన గళం విప్పి వారి విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య వంతులను చేశారని గుర్తుచేశారు. 1969లో ఢిల్లీలో తుదిశ్వాస విడిచేవరకు మఖ్ధూం మొహియొద్ధీన్ పోరాటపటిమ అమోఘమన్నారు.
కార్యక్రమంలో సంస్థ ఏడీ నరేంద్రబాబు, ఎస్పీ అలీమ్, ఏఎస్పీ, ఏవో శ్రీనివాస్, రిటైర్డ్ తహసీల్దార్లు అప్జల్, రియాజుద్దీన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, నాయకులు రత్నంగౌడ్, హరికృష్ణ, పోస్టల్ ఉద్యోగులు, మగ్దూం కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మూసీపై ఈనాడు నానాయాగి.. సుందరీకరణపై విషపు రాతలు
టీమిండియాకు విదేశీ కోచ్.. చాన్సే లేదంటున్న బీసీసీఐ!
వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్.. 550 కేక్స్ కట్ చేసిన వ్యక్తి