ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మజ్లిస్గా పిలు చుకునే ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. స్థాపించిన నాటి నుంచి నాలుగు దశాబ్దాల కాలంలో క్రమక్రమంగా తన ఉనికిని చాటుకుంటూ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా హైదరాబాద్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఎంఐఎం గెలుస్తుందని ప్రతి సర్వే చెబుతున్నది.
ఏడు స్థానాలు పక్కా
మజ్లిస్ పార్టీ హైదరాబాద్ పాతబస్తీని కంచుకోటగా మార్చుకున్నది. ఇక్కడ ప్రత్యర్థులకు డిపాజిట్లు సైతం కష్టం అనేటంతగా దూసుకెళ్తున్నది. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి 1984 నుంచి గత 40 ఏండ్లల్లో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవ రైనా గెలిచేది మాత్రం ఎంఐఎం పార్టీనే. పాతబస్తీలో అంతగా పాతుకుపోయింది మజ్ల్లిస్ పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ అసెంబ్లీ, శాసనమం డలిలో ప్రతిపక్ష హోదాలో ఉన్నది. దేశం లోని బీహార్, మహారాష్ట్ర చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో తన ప్రాబల్యాన్ని చాటు కున్నది. ప్రస్తుతం ఆ పార్టీకి దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు పెరిగాయి. అప్పటి వరకు నాలుగు సీట్లలో గెలుస్తూ వచ్చిన ఎంఐఎం 2009 సంవత్సరం నుంచి అన్ని సాధారణ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నది.
మజ్లిస్ విస్తరణకు అన్ని రాష్ర్టాల్లోనూ పోటీ
తమ పార్టీని విస్తరించడానికి అన్ని రాష్ర్టాల్లోనూ మజ్లిస్ పోటీ చేస్తున్నది. బీహార్ లో ఐదు అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్రలో ఒక లోక్సభ స్థానం, రెండు అసెంబ్లీ స్థానాలను గెలు చుకున్నది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను సాధించింది. షోలాపూర్, ఔరంగబాద్, ధూలే, అమరావతి మున్సిపల్ ఎన్నిక ల్లో లెక్కించదగిన రీతిలో సీట్లను సాధించింది. జీహెచ్ ఎంసీ సహా తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో పలు కార్పొరేట్, కౌన్సిలర్ల స్థానాలను కైవసం చేసుకున్నది.
నెలకుర్తి శ్రీనివాస్ రెడ్డి