Telangana Police | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: దేశంలోనే అత్యుత్తమ పోలీస్శాఖగా తెలంగాణ పోలీస్శాఖ ఖ్యాతి గడించిందని రాష్ట్ర హోం మం త్రి మహమూద్ అలీ కొనియాడారు. పోలీస్శాఖ ఆధునీకరణకు, అ ధికారుల నియామకాలకు, నిధుల కేటాయింపునకు దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనివిధంగా తెలంగాణ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పా రు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పో లీసు అధికారులకు పలు సేవా పతకాలను బుధవారం రవీంద్రభారతిలో డీజీపీ అంజనీకుమార్తో కలిసి మహమూద్ అలీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మా ట్లాడుతూ.. రాష్ట్రం లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉన్నందునే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ పురోగమిస్తున్నదని చెప్పారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళా భ ద్రతా విభాగం, షీ టీమ్స్ , భ రోసా కేంద్రాలు, సీసీ టీ వీల ఏర్పాటు, తదితర చర్యల తో తెలంగాణ పోలీస్ దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందని చెప్పారు. అనంతరం 2022కుగాను 30 మంది పోలీస్ అధికారులకు అతి ఉత్కృష్ట్, 28 మందికి ఉత్కృ ష్ట్ సేవా పతకాలు, ఏడుగురికి అసాధారణ అసూచన కు శలత పతకాలు, దర్యాప్తులో ఉ త్తమ ప్రతిభ చూపిన 8 మందికి కేంద్ర హోంమంత్రి మెడల్స్, శిక్షణలో ఉత్తమ ప్రతి భ కనబర్చిన 11 మం దికి కేంద్ర హోంమంత్రి మెడల్స్, 11 మందికి శౌర్య పతకాలు, ఏడుగురికి మహోన్నత సేవా పతకాలను ప్రదానం చేశారు.
పతకాలు పొందినవారు
2022 సంవత్సరానికిగాను అతి ఉత్కృష్ఠ్ సేవా పతకం స్వీకరించినవారిలో డీజీపీ అంజనీకుమార్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఐజీ వీబీ కమలాసన్రెడ్డితోపాటు 26 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. 2022 సంవత్సరానికిగాను ఉత్కృష్ట్, సేవా పతకాలు పొందినవారిలో ఐజీ తరుణ్జోషి, సైబరాబాద్ జాయింట్ కమిషనర్, డీఐజీ అవినాశ్ మహంతితోపాటు 28 మంది పోలీస్ అధికారులున్నారు. 2020-21కిగాను అసాధారణ అసూచన కుశలత పతకాలు స్వీకరించినవారిలో హైదరాబాద్ ఐజీ వీ శివశంకర్ తదితరులున్నారు.