KCR : రంజాన్ పండుగ సందర్భంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబసమేతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. మహమూద్ అలీ కుటుంబసభ్యులందరూ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మహమూద్ అలీకి, ఆయన కుటుంబసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ను కలిసిన సందర్భంగా మహమూద్ అలీ కుటుంబసభ్యులు ఆయన మునిమనుమడిని కూడా తీసుకొచ్చారు. దాంతో మహమూద్ అలీ మునిమనువడిని కేసీఆర్ ప్రత్యేకంగా ఆశీర్వదించారు.