హైదరాబాద్ : మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మహేశ్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూ. 12 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం ఈ నగదును దాదాపు వంద బ్యాంకులకు బదిలీ చేశారు.
సర్వర్ హ్యాక్కు గురైనట్లు మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం గుర్తించింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.