హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. టీఆర్ఎస్ పార్టీ అధినేతగా మళ్లీ కేసీఆరే ఉండాలని పార్టీలోని అన్ని స్థాయిల నేతలు కార్యకర్తలు నినదిస్తున్నారు. పార్టీ నియమావళిని అనుసరించి నాలుగేండ్లకోసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతాయి.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదిస్తూ టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వివిధ దేశాల టీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డికి కేసీఆర్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నారైలు అందరూ కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారని మహేష్ బిగాల తెలిపారు.
కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల,హరీష్ రంగ, సౌజన్ రావు, సాయి కిరణ్ వేముల, యూకే శాఖ నుంచి రత్నాకర్ కడుదుల, రమేష్ ఎస్సంపల్లి, శ్రీనివాస్ వల్లల, మల్లేష్ పప్పు, తాటికుంట వేణుగోపాల్, ప్రవీణ్ పంతులు, సుభాష్ కోరుపల్లి, తాటికుంట జనార్దన్ రెడ్డి, మాల్దీవుల శాఖ నుంచి అధ్యక్షుడు రాకేశ్ దత్తాత్రే యారా, కువైట్ నుంచి అధ్యక్షురాలు అభిలాష గొడిసాలా, జగదీశ్ ఉప్పల, ఇటలీ శాఖ నుంచి వినయ్, ఆస్ట్రియా శాఖ నుంచి వివేక్ , ఫిన్లాండ్ నుంచి సందీప్, ఇటలీ నుంచి వినయ్, జాంబియా నుంచి రాహుల్ రెడ్డి , వియాత్నం నుంచి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.