హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాల వారెంట్లతో సహా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)లను అమలు చేసిన స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందాన్ని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ అభినందించారు. శనివారం అధికారులను సీఐడీ చీఫ్ రివార్డులతో సత్కరించారు. సీఐడీ ఎస్పీ రాంరెడ్డి పర్యవేక్షణలో ఏడు బృందాలను ఏర్పాటు చేయగా, అవి వివిధ రాష్ర్టాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని ఆరు నెలల వ్యవధిలో పట్టుకున్నారు. ఇలా అరెస్ట్ అయిన 16 మందిలో కొందరు 30 ఏండ్లుగా పరారీలో ఉన్నట్టు గుర్తించారు. మరో 8 మంది మరణ ధ్రువీకరణ పత్రాలను సేకరించారు. 17 ఏండ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఐదుగురు ప్రత్యేక బృందాల చర్యలతో లొంగిపోయారు. మొత్తం దేశవ్యాప్తంగా 88 ఎన్బీడబ్ల్యూలను ధ్రువీకరించారు.