హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు, వాటాదారుల ప్రయోజనాలను రక్షించడంతోపాటు బ్యాంకు రోజువారీ లావాదేవీలను యథావిధిగా కొనసాగించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం ఆర్బీఐ తనకు నచ్చిన అధికారిని నియమించుకోవచ్చని తెలిపింది. బ్యాంకు పాలకవర్గ ఎన్నికలపై దాఖలైన ప్రధాన కేసులో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయని స్పష్టం చేసింది.
2018 సెప్టెంబర్లో ఈ బ్యాంకు జారీచేసిన సర్యులర్ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ఇటీవల మరోసారి విచారణ జరిపింది. కొత్తగా ఎన్నికైన బ్యాంకు డైరెక్టర్లు వి ధానపరమైన నిర్ణయాలు తీసుకోరాద ని, బ్యాంకు రోజువారీ పరిపాలన, వ్యాపారలావాదేవీలను మాత్రమే ని ర్వహించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న వాటాదారుల వాదనను ప్రస్తుత దశలో ఆమోదించలేమని తేల్చిచెప్పింది. బ్యాంకు పాలకవర్గ ఎన్నిక జరిగిన తీరు, ఇతర ప్రధాన అంశాలపై మాత్రమే తుది వె లువరిస్తామని, అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంటూ.. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.