ఆన్లైన్లో దర్శనం టికెట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 4 వరకు 11 రోజులపాటు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు తొలిపూజతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఈ నెల 23 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహిస్తామని, దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని ఈవో లవన్న తెలిపారు.