నారాయణఖేడ్, జనవరి 27: సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆ విజన్తోనే తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కర్ణాటకలోని బీదర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చిల్లర్గి, జాంపాడ్, మాలెగావ్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ఈ పథకాలు దేశ ప్రజలకు అందాలంటే బీఆర్ఎస్ను బలపర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో శివకుమార్, వైజినాథ్, దేవేంద్ర, నర్సప్ప, లాజర్, క్రాంతి, మన్సూర్, సుందర్, సాగర్ తదితరులు ఉన్నారు.