మెదక్ : పల్లెల అభివృద్ధియే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చల్మెడలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు మాత్రమే కల్యాణలక్ష్మి పథకం వర్తించడంతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసామని, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రైతులు తమ వ్యవసాయ భూముల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు. హరిత తెలంగాణయే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్న 6 మొక్కలను ప్రతి ఒక్కరూ తీసుకొని తమ ఇంటి వద్ద నాటుకోవాలన్నారు.
గ్రామాలలో పారిశుధ్య కార్మికులు ప్రతి రోజు చెత్తను ఎప్పటికప్పుడూ ప్రభుత్వం పంపిణీ చేసిన పంచాయతీ ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలించడంతో పల్లెలు పరిశుభ్రంగా మారుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం