వరంగల్ : సీఎం కేసీఆర్ పాలనలో వరంగల్కు మహర్దశ వచ్చిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం వరంగల్ చౌరస్తాలో రోడ్డు పనులను ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్కు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టి అభివృద్ది చేస్తున్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వేగంగా పనులు పూర్తి చేసి వరంగల్ తూర్పును అభివృద్ధికి కేరాఫ్ గా మార్చుతాం అని ఎమ్మెల్యే అన్నారు. అలాగే సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు రూ. 1100 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయటం పట్ల సీఎం కేసీఆర్, ఆరోగ్య ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు, మంత్రి కేటీఆర్కు, జిల్లా మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్యార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, స్థానిక కార్పొరేటర్ గందె కల్పన తదితరులు ఉన్నారు.