దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక సదస్సు-2022’ సందర్భంగా మంత్రి కేటీఆర్ను మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే తెలంగాణ పెవిలియన్లో మంగళవారం కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాలాంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు.
తెలంగాణ సర్కారు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్, పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడంలాంటి కీలకమైన సంస్కరణలను ఆదిత్య థాకరేకు కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వస్తానని ఆదిత్య థాకరే తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పట్టణాభివృద్ధిలో చేపట్టిన పలు అంశాల పైన మంత్రి కేటీఆర్కు ఆదిత్య థాకరే వివరాలు అందించారు. పరస్పరం కలిసి పని చేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.