యాదగిరిగుట్ట, ఏప్రిల్ 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉన్నదని బీఆర్ఎస్ మహారాష్ట్ర ముఖ్య నేతలు అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. ఆలయాన్ని కలియతిరిగి నిర్మాణాలను పరిశీలించారు. ‘కేసీఆర్ సాబ్ నే మందిర్ కో అచ్చా నిర్మాణ్ కరే’ అని కొనియాడారు. ఆలయ నిర్మాణానికి కేసీఆర్ శ్రమించిన తీరును దేశవ్యాప్తంగా వివరిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీలు విఠల్, యాదవరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.