MLC Elections | మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేపట్టొద్దంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని కోరింది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.