హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బంజారా ఆరాధ్యదైవం సంత్సేవాలాల్ 284వ జయంతిని పురస్కరించుకొని బుధవారం బంజారభవన్, తెలంగాణభవన్లో మహాభోగ్ భండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, సంత్సేవాల్ జయంతి ఉత్సవాల కోఆర్డినేటర్ రూప్సింగ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణతల్లి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. సంత్ సేవాలాల్ చిత్రటానికి బంజారా సంప్రదాయం ప్రకారం భోగ్బండారు నిర్వహించారు. తమ ఆరాధ్యదైవం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్కు గిరిజన ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, బంజారా సంఘం ప్రతినిధుల ఆటపాటలతో తెలంగాణభవన్ ప్రాంగణం మారుమోగింది.