యాదగిరిగుట్ట, ఆగస్టు 4 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ మాఢవీధుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర్స్వామి ఆశీస్సులతో జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జానపద కళాకారుల అఖండ హరినామ సంకీర్తన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా జానపద కళాకారులు తరలివచ్చారు.
ఒక్కొక్క బృందం ఒక్కొక్క కళారూపాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నది. శనివారం ఉదయం 8గంటల వరకు అఖండ హరినామ సంకీర్తన సాగుతుందని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి అన్నారు. తిరుపతి మాదిరిగానే యాదగిరిగుట్ట క్షేత్రంలో అఖండ హరినామ సంకీర్తన జరిపే అవకాశాన్ని జానపద కళాబృందాలకు కల్పించాలని ఆలయ ఈఓ, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రఘుబాబు మాట్లాడుతూ శ్రావణ మాసంలో నెల రోజుల పాటు అఖండ హరినామ సంకీర్తన నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
కార్యక్రమం తీరును సమీక్షించి సంవత్సరం పొడవునా నిర్వహించడానికి తగు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కళాకారుల బృందాల పేర్లను ఈఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, బృందాల వారీగా దేవస్థానం నుంచి తామే ఆహ్వానం పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినోద్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్దన్, నల్లగొండ జిల్లా కన్వీనర్ శంకర్, జయహో జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి శేషు, జై భారత్ రాష్ట్ర అధ్యక్షుడు ఖదిజ్ఞాని సత్యనారాయణ గోల, రాష్ట్ర నాయకుడు వెంకట్ పాల్గొన్నారు.