కెరమెరి, జనవరి 6 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహారాజ్గూడ సమీపంలోని అటవీప్రాంతలో కొలువైన జంగుబాయి మహాపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఆదివాసీలు వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్రాజ్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి, మాజీ ఎంపీ గోడం నగేశ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ హాజరయ్యారు. వారికి ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలతో ఘనస్వాగతం పలికారు.
కలెక్టర్ రాహుల్ రాజ్, పీవో వరుణ్రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల సంప్రదాయం గొప్పదని, నెల రోజుల పాటు జరిగే వేడుకలకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.