హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇందిరాపార్కు లో ఆదివారం మాదిగల యుద్ధభేరి మహాసభను నిర్వహించనున్న ట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు మంత్రి హరీశ్రావు హాజరుకానున్నారని పేర్కొన్నారు. మాదిగల అభ్యున్నతికి ఈ సభలో తీర్మానాలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సభ మాదిగల భవిష్యత్తును మార్చేదిగా నిలుస్తుందని తెలిపారు. మాదిగల న్యాయమైన వాటా కోసం ఐక్యతను చాటుంతుందని అన్నారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మాదిగలు తరలివచ్చి మాదిగలు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.