టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
మెదక్ మున్సిపాలిటీ, జూలై 25: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలులో మాదిగలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తిచేశారు. ఆదివారం మెదక్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సమావేశానికి హాజరైన వంగపల్లి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ మాదిగలు డప్పు దరువుతో కేంద్రం మెడలు వంచారని, అలుపెరగని పోరాటం చేసి ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 22 శాతం ఉన్న మాదిగలకు దళితబంధు పథకంలో మొదటి ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.