హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మేరకు చేనేత విభాగం రాసిన మహావస్త్ర లేఖపై సంతకం చేశారు.
జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతును కూడగట్టేందుకు చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, సినీనటి పూనమ్కౌర్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ తదితరుల బృందం దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల ఎంపీలను, ముఖ్యనేతలను నేరుగా కలుస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పర్యటించి పలువురు నేతలను కలువగా, తాజాగా మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు.