హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పదిరోజులపాటు ఘనంగా జరిగిన దసరా షాపింగ్ బొనాంజాలో సుమారు 5.97 లక్షల విలువైన నిసాన్ మాగ్నెట్ కారును మైలార్దేవ్లపల్లికి చెందిన 13 ఏండ్ల వర్షిత (కావ్య) గెలుచుకున్నది. ఈ బహుమతిని నమస్తే తెలంగాణ ప్రధాన కార్యాలయంలో గురువారం తెలంగాణ పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ డీ చిరంజీవి, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, అడ్వర్టైజ్మెంట్ జీఎం ఎన్ సురేందర్రావు, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి.. వర్షితకు అందజేశారు. టూరిజం ప్లాజాలో అక్టోబర్ 1న తీసిన లక్కీ డ్రాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నగర కమిషనర్ సీవీ ఆనంద్ వర్షిత పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు.
నా పేరు లక్కీ డ్రాలో రాగానే చాలా సంతోషించా. ఇప్పటికీ నా ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నా. సొంత కారులో ప్రయాణించాలనే మాలాంటి వాళ్ల కలను ఇలాంటి కార్యక్రమాలతోసాకారం చేస్తున్న నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు’ అని కారు విజేత వర్షిత తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జరిగిన లక్కీ డ్రాలో ప్రతిరోజు ఐదు బహుమతులు అందించారు. బంపర్ డ్రాలో నిస్సాన్ మాగ్నెట్ కారు ప్రకటించారు. హైదరాబాద్లో సుమారు 30 షాపుల్లో బొనాంజా స్కీం నిర్వహించారు. ప్రతి రోజు టీవీలు, మొబైల్స్, గిఫ్ట్ హాంపర్స్, కూపన్స్ బహుమతులుగా అందించారు.
ఈ బొనాంజాకు అద్భుతమైన ఆదరణ లభించింది. తొమ్మిదేండ్లుగా నమస్తే తెలంగాణ ఈ బొనాంజాను విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి ఫ్రీడం ఆయిల్, కేఎల్ఎం ఫ్యాషన్మాల్ టైటిల్ స్పాన్సర్గా, బిగ్సీ, సీఎంఆర్ ప్రధాన స్పాన్సర్లుగా, నిలోఫర్ -గిఫ్ట్స్ స్పాన్సర్గా, మీడియా పార్ట్నర్గా టీ న్యూస్, క్రియేటివ్ పార్ట్నర్గా హోప్ అడ్వైర్టెజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరించాయి. కార్యక్రమంలో ఏజీఎం రాజిరెడ్డి, రాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.