హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): 2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ్రా తీయనున్నారు.
భూపాలపల్లి జిల్లాలో 3, కామారెడ్డిలో ఒకటి, ఆసిఫాబాద్లో 5, నిర్మల్లో 4, ఆదిలాబాద్లో 9 దుకాణాలన్నింటికీ కలిపి ఇప్పటి వరకు 19 కొత్త దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.