కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో యువతి దారుణ హత్యకు గురయింది. మానకొండూరు మండలం చెంజర్ల శివార్లలోని గుట్టల్లో ఆమె మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువతిని వరలక్ష్మిగా గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మూడు రోజులక్రితం హత్య జరిగినట్లు తెలిపారు. ప్రియుడు అఖిల్ ఆమెను హత్యచేసినట్లు నిర్ధారించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మూడ్రోజుల క్రితం హత్యచేసి గుట్టల్లో పడేసినట్లు తెలిపాడు. కాగా, వరలక్ష్మి అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.