ధారూర్ : వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వికారాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ మరో వ్యక్తి మృతి ప్రాణాలు కోల్పోయాడు. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మృతుల్లో ఆటో డ్రైవర్ జమీల్, రవి, కిషన్, సోనీబాయిగా గుర్తించారు. బాధితులంతా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ వాసులుగా పోలీసులు తెలిపారు. కూలీ పనుల కోసం వికారాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాల రోధనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.