హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కొత్త తెలంగాణ చరిత్ర బృం దం.. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం పరిధిలోని దట్టమైన అ డవిలో లక్ష్మీ సమేత యోగానంద నరసింహ స్వామి మూర్తిని గుర్తించింది. బండరాయిపై చెక్కిన్న ఈ నరసింహస్వామి విగ్రహం సు మారు 16వ శతాబ్ధానికి చెందినదని బృం దం సభ్యులు భావిస్తున్నారు.
ఇది పంచనారసింహులలో విశిష్టమైనదని చెప్తున్నారు. యా దగిరిగుట్ట, పెన్పహాడ్, హంపిలలో ఇలాంటి యోగానందుని ప్రతిమలు ఉన్నట్టు తెలిపారు. గంగారం అడవిలోని శిథిలాల్లో చిన్న గుడి ఉండగా, అందులో ఇసుకరాతిపై ఇది చెక్కి ఉన్నట్టు వెల్లడించారు. గుడి పక్కనే బండరాయిపై చాళుక్యుల కాలం నాటి భైరవుని శిల్పం కూడా ఉన్నదని పేర్కొన్నారు.