కరీంనగర్ : కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ను కోరారు. bకరీంనగర్ నుంచి బయలుదేరి జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ రైలు కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంగా మొదటి దఫా లాక్ డౌన్ సమయంలో ఈ రైలు సర్వీసులను రైల్వే బోర్డు నిలిపివేసిందని వినోద్ కుమార్ తెలిపారు.
తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో లోకమాన్య తిలక్ రైలును కరీంనగర్ నుంచి ముంబైకి ప్రారంభించినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ రైలు సేవలు నిలిచిపోవడంతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా ప్రజలకు ముంబైకి నేరుగా వెళ్లే అవకాశాలు లేకుండా పోయాయని వినోద్ కుమార్ వివరించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంటనే లోకమాన్య తిలక్ రైలు సేవలను తిరిగి ప్రారంభించాలని వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ని కోరారు.