హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిగా రాబోయే లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల(సీఈవో)కు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ సూచించారు. శుక్రవారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రణాళికపై సీఈసీ ఢిల్లీ నుంచి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ర్టాల ఎన్నికల అధికారులకు అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన విధానాలను తెలిపారు. వెబ్కాస్టింగ్, ఎపిక్ కార్డుల పంపిణీ, పక్కాగా ఓటర్ల జాబితా రూపకల్పన వంటి అంశాలను వివరించారు. సమీక్షలో తెలంగాణ నుంచి అడిషనల్ సీఈవో లోకేశ్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.