Lok Sabha Elections | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం ఎన్నికల నగారా మోగనుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 29న ప్రకటిస్తారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 1.80 లక్షలమంది పోలింగ్ సిబ్బంది, మరో 25 వేలమంది ఇతర సిబ్బంది, 60 వేలమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. రాష్ట్రం లో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా అందులో రెండు ఎస్టీ, మూడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్సభ స్థానానికి ఈవీఎంపై తెలుపురంగు బ్యాలెట్ను ఉపయోగించగా, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో మాత్రం గులాబీరంగు బ్యాలెట్ పేపర్ను ఉపయోగిస్తారు.
నామినేషన్ రికార్డింగ్
నామినేషన్ ప్రక్రియ మొత్తాన్ని రికార్డింగ్ చేయనున్నారు. అభ్యర్థితోపాటు గరిష్ఠంగా ఐదుగురిని రిటర్నింగ్ అధికారి కార్యా లయం లోకి అనుమతిస్తారు. ఆన్లైన్ లోనూ నామి నేషన్ వేసుకునే వెసులు బాటు ఉన్నప్పటికీ, ప్రింటెడ్ కాపీని మాత్రం ఆర్వోకు సమ ర్పించాల్సి ఉంటుంది. ఓటుహక్కు వినియో గించుకునే విషయంలో 85 ఏండ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 7.19 లక్షల వరకు ఉంది. మే 8లోపు వీరు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నది.
బ్యాంకు ఖాతాలపై నిఘా
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో గురువారం నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. బ్యాంకుల నుంచి లక్ష, అంతకుమించి డ్రా చేసినా, జమ చేసినా ఆ ఖాతాలపై నిఘా పెడుతున్నారు. రూ. 10 లక్షలకు మించి డ్రా చేస్తే ఆ సమా చారాన్ని ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. తనిఖీల్లో దొరికిన డబ్బుకు ఆధారాలు చూపిస్తే మాత్రం వెనక్కి ఇస్తున్నారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నిక
లోక్సభతోపాటే కంటోన్మెంట్ నియోజకవర్గ ఉపఎన్నికకు కూడా పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో ఓటర్లు
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్