ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ర్యాలీ
చెన్నూర్, మార్చి 8: మంచిర్యాల జిల్లా చెన్నూ ర్ ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. చెన్నూర్ నియోజకవర్గ రైతులకు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతలను బహుమతిగా ఇవ్వడంపై సంబురపడుతున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపు మేరకు మంగళవారం చెన్నూర్ లో సీఎంకు కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. చెన్నూర్, క్యాతన్పల్లి, మందమర్రి మున్సిపాలిటీలతోపాటు చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూ ర్, మందమర్రి మండలాల నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ తీశారు. ముందుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుతూ, పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకొన్నారు.