వినోద్కుమార్కు ముదిరాజ్ మహాసభ విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల పంపిణీకి అవసరమైన చేప విత్తనాలను సరఫరా చేసే అవకాశం రాష్ట్రంలోని మత్స్యకారులకే ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభాగం కోరింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు ఆదివారం ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో దాదాపు 880 హెక్టార్ల విస్తీర్ణంలో తెలంగాణ మత్స్యకారులు చేపపిల్లల నర్సరీలను నిర్వహిస్తున్నారని, ఈ నర్సరీల నుంచి చేప విత్తనాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వినోద్కుమార్.. మత్స్యశాఖ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. వినోద్కుమార్ను కలిసిన వారిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ సలహాదారు పిట్టల రవీందర్, యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనుముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ముదిరాజ్, పండుగ బాలుముదిరాజ్, బొకా శ్రీనుముదిరాజ్, బిల్లు సత్తయ్య, గొడుగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.