హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలు పరిష్కరించాలని గద్వాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్కు స్థానిక అర్చకులు వినతిపత్రం సమర్పించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకాన్ని అర్హులైన మరో 1326 మంది అర్చకులకు వర్తింపజేయాలని, దేవాదాయ భూముల పరిరక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించి, అర్చకులు పేర్కొన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.