హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 35 వేల మహిళా స్వయం సహాయక సం ఘాల సభ్యులు పది లక్షలకుపైగా రుణాలు పొందారు. మహిళా సంఘాలను బలోపేతంచేయడంలో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ద్వారా పెద్దమొత్తంలో రుణాలను అందిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,040 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటికే రూ.11,400 కోట్ల రుణాలను 2.38 లక్షల సంఘాలకు అందించారు. మిగిలిన మొ త్తాన్ని మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పూర్తి చేయాలని నిర్ణయించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గత సెప్టెంబర్లో మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందించాలని బ్యాంకులకు సూచించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో వెంటనే అమల్లోకి వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా ఆరు లక్షలకు పైగా సంఘాలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణంగా అందించారు. 29,400 సంఘాలకు రూ.10 లక్షల వరకు రుణాలను అందజేశారు. 40 వేల సంఘాలకు రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, 51 వేల సంఘాలకు రూ.5 నుంచి 7 లక్షల వరకు రుణాలను అందించారు. ఈ రుణాలను మహిళా సంఘాల సభ్యులు వ్యవసాయ, వ్యవసాయేతర, ఉత్పాదక రం గాలపై వెచ్చిస్తున్నారు. దీనితో వారి కుటుంబానికి మ హిళలు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు. మహిళా సం ఘాలు రుణాలు తీసుకోవడమే కాకుండా, 98 శాతం రికవరీ ఉండడం గమనార్హం.