హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): పది, ఇంటర్ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే. జస్టిస్ శ్రవణ్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
ఇంటర్ బోర్డు తరఫున కమిషనర్ నవీన్ మిట్టల్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చిలో కాలేజీల ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, విద్యార్థులపై ఒత్తిడిని పెంచొద్దని సూచించామని తెలిపారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి, టెలీ కౌన్సెలింగ్కు టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఫలితాలను వెల్లడించకుండా విద్యార్థుల ఉత్తీర్ణతను వేరే విధంగా తెలియజేయడంపై సూచనలు చేయాలని ఇరు పక్షాలను కోరిన ధర్మాసనం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది