హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1లో 60 ఉద్యోగాల భర్తీకి జీవో ఇవ్వడం బాగానే ఉన్నదని, మిగిలిన 1,99,940 ఉద్యోగాల సంగతేంటని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమతో కలిసి మీడియా సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఈ నెలాఖరులోగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఖాళీల భర్తీకి డిసెంబర్ వరకు వేచి చూస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశారని, 42,652 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా నిర్వహించారని, ఫలితాలు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మార్చుతున్నట్టుగా మల్టీ జోనల్, జోన ల్ విధానాన్ని మార్చవద్దని ప్రభుత్వాన్ని కో రారు. జిల్లా పునర్విభజన పేరుతో వీటిని మార్చితే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. 7 వేల నర్సుల ఉ ద్యోగాలను భర్తీ చేశామని సీఎం రేవంత్ చెప్పుకోవడం సరికాదని, వాటి నోటిఫికేషన్ను కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చి వరి దశలో ఉందని, దీనిని కూడా రేవంత్ తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పార్టీ మారినంత మాత్రాన విమర్శ లు చేయాల్సిన పనిలేదని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ను ఉద్దేశించి వినోద్కుమార్ సూచించారు.
బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ మొదటి క్యాబినెట్లోనే మెగా డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్రెడ్డి చెప్పారని, కానీ ఇప్పటి వరకు దాని జాడే లేదని విమర్శించారు. దీనిపై సీఎం వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే విడుదలైన గ్రూప్స్, డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని, కొత్త పోస్టులకు మరో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొత్త పోస్టులకు ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు ముడి పెట్టవద్దని సూచించారు.