హనుమకొండ : సామాజిక సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఆదివారం ములుగురోడ్ లోని వజ్ర గార్డెన్స్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషన్, గౌతమ్ బుద్ధ రీజియన్ మీట్లో మంత్రి పాల్గొన్నారు. లయన్స్ రీజినల్ చైర్మన్గా నూతనంగా ఎంపికైన చెన్నమనేని జయశ్రీ, తదితరులను మంత్రి అభినందించి, సావనీర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సమాజంలో ఆపదలో ఉన్న పొరుగువారికి సహకారం అందించాలనే సదాశయంతో లయన్స్ క్లబ్ ఏర్పడటం అభినందనీయమని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వివిధ లయన్స్ క్లబ్స్ సమాజానికి పలు సామాజిక సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో కూడా స్వచ్ఛంద సంస్థలు పాల్గొని విజయవం చేయాలని పిలుపునిచ్చారు.