హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగా ణ): టీచర్ల బదిలీలకు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. 5, 9 జీవోలకు శుక్రవారం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించింది. టీచర్ల బదిలీలకు ఈ ఏడాది మొదట్లోనే పచ్చజెండా ఊ పిన ప్రభుత్వం.. మార్గదర్శకాలతో జనవరి 25న నంబర్ 5 జీవోను జారీ చేసింది. కొన్ని సవరణలతో ఫిబ్రవరి 7న నంబర్ 9 జీవోను జారీచేసింది. ఆ వెంటనే షెడ్యూల్ను విడుదల చేసి, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. దీంతో 79 వేల మందికిపైగా టీచర్లు దరఖాస్తులు సమర్పించారు. కానీ, బదిలీలు ప్రారం భం కావాల్సిన తరుణంలో కొందరు జీవోల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కేసు వేశారు. దీంతో 7 నెలల నుంచి బదిలీలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యుహాత్మకంగా వ్యవహరించింది. కోర్టులో దీర్ఘకాలంపాటు వాదనలు వినిపించడం కంటే ఆ జీవోలకు చట్టబద్ధత కల్పిస్తే సమస్యే ఉండదని భావించింది. దీంతో హైకోర్టులో ఉన్న స్టే వెకేట్ అవుతుందని, బదిలీలకు మార్గం సుమగమమవుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హైకోర్టు పచ్చజెండా ఊపితే మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని యోచిస్తున్నారు.
5, 9 జీవోలకు చట్టబద్ధత కల్పించడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశా యి. అసెంబ్లీలో మంత్రి సబితను కలిసి ధన్యవాదాలు తెలిపాయి. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రవీందర్, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్రెడ్డి, కమలాకర్రావు, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎంల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి, ఎస్జీటీయూ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి తదితరులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.