సూర్యాపేట : దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నిండగా మోదీ పాలనలో ఆకలి కేకలతో అలమటిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు రాపర్తి మహేశ్ ఆధ్వర్యంలో సూర్యపేటలోని పిల్లలమర్రి 12 వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానం పలికారు.
మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అనే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. కేసీఆర్ ను మించిన నాయకుడు దేశం లో ఎవరూ లేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తోనే దేశ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కేవలం 6గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని విమర్శించారు.మోదీ పాలనలో కేవలం ఒక్కరిద్దరూ సంపన్నుల ను మరింత సంపన్నులను చేయడం కోసమే సాగుతుందని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో పంచాయతీగా ఉన్న పిల్లలమర్రి లో రూ. 2 కోట్ల నిధులతో సీసీ రహదారులను నిర్మించగా నేడు 22 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారు..
కాంగ్రెస్, బీజేపీకి చెందిన వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్తో పాటు మాధగొని కేశవులు, చెరుకుపల్లి బంగారి మల్లయ్య, సయ్యద్ రసూల్, బంగారి నరేశ్, సట్టు వెంకన్న, చెరుకుపల్లి హరిబాబు, సట్టు కపిల్, కోనేటి కృష్ణ, మేకమ్ వెంకన్న, కామిశెట్టి వంశీ, కొండ మధు బీఆర్ఎస్లో చేరారు. గాజుల సైదులు, కొండ సాయి, గాజుల నాగరాజు, అర్వపల్లి, జనార్దన్, ముత్తిలింగయ్య, ఆలేటి సాంబయ్య, సుంకరి శ్రీను, శ్రీకాంత్ తో పాటు రెండువందల మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.