రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు పడింది. ఐదుగురు రైతులు ఈ పిడుగు పాటుకు గురయ్యారు. దీంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి వైద్యం అందిస్తున్నారు. ఈ రైతుల పరిస్థితిపై జిల్లా కలెకర్ట్ అధికారులతో ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
కోనారావు పేట మండలంలోని కనగర్తిలో ఈదురు గాలులతో వర్షం పడింది. ఒక్కసారిగా విపరీతమైన ఈదురు గాలులు వీయడంతో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. రేకులు లేచిపోయి, ఇళ్లు చిందర వందర అయిపోయింది. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అలాగే కాలనీలోని రోడ్లపై ఉన్న చెట్లు విరిగిపోయాయి.