హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.