హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అగ్రవర్ణాలు, బలహీన వర్గాల మధ్య అసమానతలు తొలగే లా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నా రు.
ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా ధర్మవరంలో అరుణోదయ యూత్ ఏర్పాటుచేసిన జగ్జీవన్రామ్, అంబేదర్ విగ్రహాలతోపాటు దొమ్మేరులో దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని తోట చంద్రశేఖర్తో కలిసి ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఆవిషరించారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాం ట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటుపరం చేయాలనుకొనే కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.