భద్రాద్రి కొత్తగూడెం : గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం, ఎర్రబోడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు గురువారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించారు.
నిందితులపై చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మకమైన ఈ కేసులోని నిందితులు మడకం తులా, పోడియం నంగాలను పోలీసులు వెంటనే అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కాగా, హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వినీత్అ న్నారు.నేరం చేసిన వారికి చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పారు.