వరంగల్ చౌరస్తా, మే 5: వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ప్లాస్మాదానం చేసిన యువకుడు ఇద్దరి ప్రాణాలను కాపాడాడు. భూపాలపల్లిలోని ఆజంనగర్కు చెందిన ఉమ్మల్ల వెంకటేశ్.. ఏప్రిల్ 2న కరోనా బారినపడి 12న కోలుకున్నాడు. వరంగల్లో వేర్వేరు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న జక్కుల సంధ్య, సాంబయ్యకు ‘ఓ’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా అవసరమైంది. మంగళవారం అర్ధరాత్రి బాధితులు.. యువ నేతాజీ ఫౌండేషన్ ప్రతినిధులు కొత్తకొండ అరుణ్కుమార్, కన్నె రాజును సంప్రదించారు. వీరు ఫౌండేషన్ద్వారా ‘ఓ’ పాజిటివ్ గ్రూపు రక్తాన్ని 14సార్లు రక్తదానం చేసిన వెంకటేశ్ను సంప్రదించగా ప్లాస్మాదానం చేయడానికి అంగీకరించారు. తెల్లవారుజామున భూపాలపల్లి నుంచి వరంగల్ వచ్చి ప్మాస్మాదానం చేశాడు. కరోనా నుంచి కోలుకున్నాక ప్లాస్మా దానం చేయవచ్చని వెంకటేశ్ చెప్పారు.