ములుగు : జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ విడుదల చేసిన లేఖలో ఇసుక కాంట్రాక్టర్లను తీవ్రంగా హెచ్చరించారు. కాంట్రాక్టర్లు ప్రభాకర్ చౌదరి, పిల్లుట్ల శ్రీను ఆదివాసీలను మోసం చేసే ప్రయత్నాలు మానుకోకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు.