హైదరాబాద్,చిక్కడపల్లి జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులను మూసివేయాలన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని పలువురు మేధావులు, విద్యావేత్తలు తప్పుబట్టారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సర్కార్ తీరును ఖండించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్డ్కి బహిరంగ లేఖను రాశారు. 27వేల ప్రభుత్వ బడులను నాలుగు వేలకు కుదిస్తామని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, న్యాక్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ డీ నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ జీ హరగోపాల్, ప్రొఫెసర్ చక్రధర్రావు, ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ, నందిని సిధారెడ్డిలు ఉన్నారు.