DK Shivakumar |బెంగళూరు, నవంబర్ 4: ఫాక్స్కాన్ యూనిట్ను హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు తరలించాలని కోరుతూ ఆ సంస్థ చైర్మన్కు తాను రాసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లేఖ ఫేక్ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.
దీనిపై తాను బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్లో పోస్టు చేశారు.