యాదాద్రి భువనగిరి : వాసాలమర్రి గ్రామ పునర్నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుకుందామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంగళవారం గ్రామ పునర్నిర్మాణంలో భాగంగా.. అధికారులు ఆర్కిటెక్చర్లు రూపొందించిన గ్రామ డ్రాఫ్ట్ లేఅవుట్ను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.
అదేవిధంగా గ్రామానికి చెందిన ఐదుగురు దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న 340 పెంకుటిళ్లు, మట్టిగోడలు రేకుల ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో ఒక్కో కుటుంబానికి 200 గజాల స్థలంలో నూతన గృహాలను నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు.
దళిత బందు లబ్ధిదారులు తమకు మంజూరైన యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.